ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ: ప్రధాని నరేంద్ర మోదీ

 మీకు మీరు క‌ర్ఫ్యూ విధించుకోవాలి. ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు.  ఇంట్లోనే ఉండాలి. ప్ర‌జా క్షేమం కోసం ఈ నియ‌మం త‌ప్ప‌దు. ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉంటేనే.. ప్ర‌పంచం ఆరోగ్యంగా ఉంటుంది.  క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు ఇది అవ‌స‌రం.  ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విష‌యాల‌ను ఆయ‌న చెప్పారు.  జ‌న‌తా క‌ర్ఫ్యూను ఈ ఆదివారం చేప‌ట్టాల‌ని ఆయ‌న సూచించారు.  ఇంటి వ‌ద్ద‌, బాల్కనీలో నిలుచుని 22వ తేదీన సాయంత్రం 5 గంట‌ల‌కు జ‌నాల్ని జాగృతం చేయాల‌న్నారు.  సేవే ప‌ర్మోధ‌ర్మం.. అన్న భార‌త విధానాన్ని అవ‌లంబించాల‌న్నారు. డాక్ట‌ర్ల నుంచి వీలైన‌న్ని స‌ల‌హాలు తీసుకోండి.  తెలిస‌న డాక్ట‌ర్ల‌ను వీలైనంత త్వ‌ర‌గా సంప్ర‌దించండి.